Home / SLIDER / మెగా టెక్స్ టైల్ పార్కు ఎంతవరకు వచ్చింది-ఎమ్మెల్సీ పోచంపల్లి

మెగా టెక్స్ టైల్ పార్కు ఎంతవరకు వచ్చింది-ఎమ్మెల్సీ పోచంపల్లి

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి విదితమే. అందులో భాగంగా నిన్న ఆదివారం శాసన మండలిలో వరంగల్ జిల్లా స్థానిక సంస్థల తరపున ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తొలిసారి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి మాట్లాడుతూ” ముందుగా శాసన మండలిలో నాకు తొలిసారి అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, యువనేత మంత్రి కేటీఆర్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.

శాసనమండలిలో తొలిసారి మాట్లాడటమే నా అభిమాన నాయకుడు మంత్రిగా ఉన్న శాఖ గురించి కేటీఆర్ గారిని అడగటం నాకు చాలా గర్వంగా.. ఆనందంగా ఉంది”అని ఆయన తన స్పీచ్ ను మొదలెట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కును ఉమ్మడి వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో శాయంపేటలో నిర్మిస్తుంది. ఇందుకు ప్రభుత్వం ఎంత భూసేకరణ చేసింది.

పనులు ఎంతవరకు వచ్చాయి. ఎన్ని పెట్టుబడులు వచ్చాయి. ఎంతమందికి ఉపాధి కలుగుతుందని”ప్రశ్నలను లెవనేత్తారు. మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నలకు బదులిస్తూ” మెగా టెక్స్ టైల్ పార్కుకు కోసం మొత్తం 1160ఎకరాల భూసేకరణ జరిగింది. మరో డెబ్బై ఐదు ఎకరాలు సేకరించాల్సి ఉంది. పార్కులో ఇప్పటికే తొంబై శాతం అంతర్గత రోడ్ల నిర్మాణం జరిగింది. అంతేకాకుండా మొత్తం రూ.4,500కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం పదహారు కంపెనీలతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకున్నాయి. ప్రత్యేక్షంగా పరోక్షంగా 1.13లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. అతి కొద్ది రోజుల్లోనే రూ. వంద కోట్లతో 132కెవీ సబ్ స్టేషన్ ను నిర్మిస్తామని”ఆయన సమాధానమిచ్చారు..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat