నవ్యాంధ్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత,మాజీ స్పీకర్, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్,ప్రస్తుత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాయాంలో మంత్రిగా పనిచేసిన కోడెల శివప్రసాదరావు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు మృతి చెందారు. ఆయన మృతిపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తోన్నారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అని కొంతమంది అంటున్నారు.
లేదు పార్టీలోని అంతర్గత గొడవలు.. కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన వివాదాల కారణంగా ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అని ప్రచారం జరుగుతుంది. తాజాగా ఆయన మృతిపై మరో వాదం తెరపైకి వస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో నరసరావుపేట నుండి గెలుపొందిన ఆయన స్పీకర్ గా బాధ్యతలు నిర్వహిస్తునే కోడెల ట్యాక్స్ పేరిట పాల్పడిన పలు అక్రమాలకు..
అన్యాయాలకు.. ముఖ్యమంత్రిగా బాబు చేసిన పలు అరాచకాలకు,అన్యాయాలకు కేంద్ర బిందువుగా నిలిచిన కోడెల శివప్రసాదరావుపై సొంత కుటుంబ సభ్యులతో పాటుగా .. ఆ పార్టీకి చెందిన కొంతమంది నేతలు తీసుకొచ్చిన ఒత్తిడికి తట్టుకోలేక గుండెపోటు రావడంతో చనిపోయారని మరికొంత మంది వాదిస్తున్నారు. అయితే కోడెల మృతిపై నిజనిజాలు బయటకు రావాలంటే పోస్టుమార్టం నివేదిక రావాల్సిందే అన్నమాట. అప్పటివరకు కోడెల మృతిపై వచ్చే వార్తలన్నీ ప్రచారమే అని భావించాలని విశ్లేషకులు చెబుతున్నారు.