2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి, రైతులకు ఎన్నో ఆశలు చూపించి చంద్రబాబు గెలిచాడు. అలాంటి వ్యక్తి గెలిచిన తరువాత ప్లేట్ తిప్పేసాడు. దాంతో రాష్ట్రంలో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చంద్రబాబు తన కుటుంబ బాగుకోసమే చూసుకున్నాడు తప్ప ప్రజలకు మాత్రం చేసిందేమీ లేదు. చంద్రబాబుకు రాజకీయ పిచ్చ ఎక్కువగానే ఉందని చెప్పాలి ఎందుకంటే అప్పట్లో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ బ్రతికున్నంత కాలం తగిన స్థానం కల్పించకుండా, ఎన్నో అవమానాలకు గురి చేసిన విషయం తెలిసిందే. చివరికి ఆయన చనిపోయాక కూడా శవాన్నిపక్కన పెట్టుకొని నీచ రాజకీయాలు చెయ్యాలని చూసాడు. టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసాడు. ఇక ఇప్పుడు కోడెల విషయానికి వస్తే మొన్నటివరకు టీడీపీ నాయకులతో కోడెలను అనరాని మాటలు అనిపించి కోడెల పరువు తీయించిన చంద్రబాబు ఇప్పుడు కోడెల మరణాంతరం తన భౌతికకాయం దగ్గర శవ రాజకీయాలు చేస్తున్నాడు. ప్రభుత్వ వేదింపుల వల్లే చనిపోయాడంటూ మొదలుపెట్టిన బాబుగారు అప్పుడు ఎన్టీఆర్ ని ఎన్నో అవమానాలతో మానసికంగా, శారరీకంగా క్షోబ పెట్టి చంపావ్ అని అంటున్నారు, మరి దీనికి ఏమంటావ్?