మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. కోడెల మొదట ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు వదంతులు సృష్టించారు. మరోవైపు కోడెల గుండెపోటుతో మరణించారు అంటూ పలువురు చెబుతున్నారు .. తాజాగా కోడెల మృతికి సంబందించి మేనల్లుడు సాయి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్తికోసం కొడుకు శివరామే తండ్రిని హత్య చేశాడని అన్నారు. ఇక అప్పట్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా కోడెల పొదిలిలో ఉన్న సమయంలో అతని ఇంట్లో బాంబు పేలడంతో నలుగురు మరణించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకులు అతడిపై ఆరోపణలు కూడా చేసారు. అనంతరం విజయవాడలో కాపు నేత మరియు కాంగ్రెస్ నాయకుడు వంగవీటి రంగా హత్య సమయంలో కోడెల హోంమంత్రి గా ఉన్నారు. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అలజడులు మొదలయ్యాయి. కోడెల మంత్రి పదవిలో ఉన్నప్పటికీ ఏమీ చేతగాక ఆ పదవికి రాజీనామా చేసారు. కాని ఇదంతా ఒక రాజకీయ ఎత్తుగడలో భాగమని వార్తలు కూడా వచ్చాయి. ఆ తరువాత తూర్పుగోదావరి జిల్లాలో తుఫాన్ బాధితులకు అందించే బియ్యం విషయంలో కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. అప్పట్లోనే ఈ మూడు ఘటనల్లో తాను అనేక ఆరోపణలు ఎదుర్కున్నాడు.