ఆరోగ్యం రంగంపై నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు జీతాలు పెంచాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగీకరించారు. ఇందుకు ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులకు ఆదేశించారు. సిఫార్సులపై నిపుణులతో విస్తృతంగా చర్చించిన ముఖ్యమంత్రి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 150 ఆస్పత్రుల్లో సూపర్ స్పెషాలిటీ సేవలకు నవంబర్ 1నుంచి ఆరోగ్యశ్రీ వర్తింపచేచనున్నారు. అలాగే ఈ డిసెంబర్ 21 నుంచి ఆరోగ్యకార్డుల జారీ ప్రారంభిస్తున్నారు. వీటితోపాటు ఆరోగ్యశ్రీ జాబితాలోకి అదనంగా వ్యాధులు జతచేస్తున్నారు. వేయి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపును ఏప్రిల్ 1, 2020 నుంచి జిల్లాల వారీగా అమలు చేస్తున్నారు.
ఆపరేషన్ చేయించుకున్నవారికి కోలుకునేంత వరకూ విశ్రాంతి సమయంలో నెలకు రూ.5వేల చొప్పున సహాయం చేయనున్నారు. అలాగే ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధానికి జీతాలు పెంచుతూ ప్రతిపాదనలు తయారుచేయాలని సీఎం ఆదేశించారు. మన విద్యావ్యవస్థల్లో సమూల మార్పులు రావాలని, వర్క్ ఎక్స్పీరియన్స్ కచ్చితంగా ఉండాలన్నారు. రోగులు ఆస్పత్రికి రాగానే వారికి నమ్మకం కలిగించేలా ఉండాలని, బెడ్లు, దిండ్లు, బెడ్షీట్లు, బాత్రూమ్స్, ఫ్లోరింగ్, గోడలు వీటన్నింటినీ కూడామార్చాలని, అవసరమైన చోట ఏసీలు ఏర్పాట చేయాలని సీఎంఆదేశించారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తప్పనిసరిగా నర్సింగ్కాలేజీలను ఏర్పాటు చేయాలన్నారు. 108, 104 తదితర సేవల్లో వాడుతున్న వాహనాల నిర్వహణకు సమర్థవంతమైన యంత్రాంగాన్ని వినియోగించాలని, ప్రతి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కనీస సిబ్బందిని 9 నుంచి 13కు పెంచాలన్నారు. ప్రతి పీహెచ్సీలో ముగ్గురు వైద్యులు ఉండాలన్నారు. ఎంతో విలువైన వైద్యాన్ని ఉచితంగా అందిందన్న దానిపై ఆరశీదులో పేర్కొనాలని, వైద్యంమీద ప్రజల ప్రస్తుతం 62 శాతం ఖర్చు చేస్తున్నారు దాన్ని 2025 నాటికి 30 శాతానికి తగ్గించాలన్నారు.