తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరాలు ప్రకటించారు. ఈ రోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ”తెలంగాణ అభివృద్ధిలో సింగరేణి పాత్ర మరువలేనిది.గడిచిన ఐదేండ్లలో లాభాలు ఇంతకుఇంత పెరుగుతూ వస్తున్నాయి.సింగరేణి సాధిస్తున్న ప్రగతి ప్రభుత్వ పాలనా దక్షతకు నిదర్శనం.
రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది . సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది.2017-18లో సింగరేణి లాభాల్లో 27% బోనస్ అందించాం.ఈ ఏడాది సింగరేణి లాభాల్లో కార్మికులకు 28% బోనస్ అందిస్తున్నాం.
దీంతో ఒక్కో కార్మికుడికి రూ.1లక్ష 899లు అందుతాయి.ఇది సింగరేణి కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న దసరా కానుక..సింగరేణి కార్మికుల శ్రమ వెల కట్టలేనిది.ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి కార్మికులను పట్టించుకోలేదని” ఆయన అన్నారు.