Home / ANDHRAPRADESH / దేశ చరిత్రలో ఓ రికార్డు…పరీక్షలు పూర్తయిన 11 రోజుల్లోనే ఫలితాలు విడుదల

దేశ చరిత్రలో ఓ రికార్డు…పరీక్షలు పూర్తయిన 11 రోజుల్లోనే ఫలితాలు విడుదల

2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి.. 57 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి రికార్డు సాధించారు. నేడు ఆయన తనయుడు అదే ముఖ్యమంత్రి హోదాలో ఉండి వైఎస్‌ జగన్‌ రెండింతల పోస్టులను భర్తీ చేస్తూ సరికొత్త రికార్డు సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ రాతపరీక్షల ఫలితాల(మార్కులు)ను సీఎం జగన్‌ గురువారం తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. 1,26,728 ఉద్యోగాలకు నిర్వహించిన రాత పరీక్షలకు 19,50,582 మంది హాజరు కాగా 1,98,164 మంది కనీస అర్హత మార్కులు సాధించి ఉత్తీర్ణులయ్యారు.
అయితే ఒకేవిడతలో1,34,524 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. దేశ చరిత్రలో ఓ రికార్డుగా చెబుతున్నారు వైసీపీ నేతలు. నోటిఫికేషన్‌ జారీ చేసిన 35 రోజులకే రాత పరీక్షల నిర్వహణ.. మరో రికార్డు గా అంటున్నారు. మొత్తం 21,69,529 మంది దరఖాస్తు చేసుకుంటే 19,50,582 మంది హాజరై జాతీయ స్థాయి పరీక్షల్లో కూడా లేని రీతిలో లక్షల మంది హాజరైనా ప్రశాంతంగా, తప్పులు దొర్లకుండా, యూపీఎస్‌సీ తరహాలో నిర్వహణ జరిగిందంట. అంతేకాదు ఇదీ రికార్డే ఏ ఉద్యోగ రాతపరీక్షల ఫలితాలూ వెల్లడి కానంత వేగంగా.. పరీక్షలు పూర్తయిన 11 రోజులకే ఫలితాలు వెలువడటం మరో రికార్డు అంటున్నారు వైసీపీ నేతలు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat