మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రంలో అందాల భామలు నయనతార,తమన్నా ,బిగ్ బి అమితాబ్ బచ్చన్,విజయ్ సేతుపతి తదితరులు నటిస్తున్నారు. ఇటీవలె చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో వైభవంగా జరిగింది. ఇక చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకుంది. అక్టోబర్ 2న నాలుగు బాషల్లో రిలీజ్ కానుంది. ఇక అసలు విషయానికి వస్తే ఇందులో జగపతిబాబు వీరారెడ్డి పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఇందులో ఇతడిదే అసలు ట్విస్ట్ అని అందరు అంటున్నారు. ఎప్పటిలానే నెగటివ్ రోల్ లో క్లైమాక్స్ లో ఒక పెద్ద ట్విస్ట్ తో రాబోతున్నాడని, అదే చిత్రానికి హైలైట్ గా నిలవనుందని సమాచారం. అంతేకాకుండా కొన్ని చోట్ల బాహుబలి రికార్డులను బ్రేక్ చేయొచ్చని భావిస్తున్నారు.