మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా కొణిదెల ప్రోడక్షన్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి.
ఈ చిత్రంలో తమన్న,నయనతార,అమితాబ్ బచ్చన్,విజయ్ సేతుపతి,సుదీప్ ,జగపతి బాబు పలువురు నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండో తారీఖున విడుదల కానున్నాది.
ఒక విషయంలో మాత్రం సైరా నరసింహా రెడ్డి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి మూవీని మించిపోయింది. అదేమిటంటే బాహుబలికి వినియోగించిన 2300 వీఎఫ్ఎక్స్ చాలా కీలక పాత్ర పోషించింది. కానీ సైరాకు మాత్రం ఏకంగా 3800 వీఎఫ్ఎక్స్ షాట్స్ ను వినియోగించారని దర్శకుడు రాజమౌళి చెప్పారు .అయితే ఇది చాలా కష్టమని జక్కన్న చెబుతున్నాడు.