తెలంగాణలో కోటీ ఎకరాలకు సాగునీళ్ళివ్వడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించతలపెట్టిన మహోత్తర కార్యం కాళేశ్వరం నిర్మాణం.. అప్పటి నీళ్ల మంత్రి ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు నేతృత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో కేవలం మూడేళ్లలోనే నిర్మించిన అద్భుత ప్రాజెక్టు కాళేశ్వరం.
ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తొంబై తొమ్మిది శాతం పనులు పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన ప్రాజెక్టులు,పంపుహౌస్ లు నీళ్లతో కళకళలాడుతున్నాయి. ఇంతటి గొప్ప ప్రాజెక్టు అయిన కాళేశ్వరం పై వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయిన రాజేందర్ సింగ్ ప్రశంసలు కురిపించారు.
ఆయన మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు విజయవంతమైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం దేశానికి ఆదర్శంగా నిలిచింది. కోటీ ఎకరాలకు సాగునీళ్లివ్వాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం గొప్పది. గోదావరి జలాలను వాడుకుంటే తెలంగాణ బంగారు తెలంగాణ కావడం “ఖాయమన్నారు.