Home / ANDHRAPRADESH / బ్రేకింగ్… ఆ విషయంలో టీడీపీ నేత వర్ల రామయ్యకు ఏపీ సర్కార్‌ నోటీసులు…!

బ్రేకింగ్… ఆ విషయంలో టీడీపీ నేత వర్ల రామయ్యకు ఏపీ సర్కార్‌ నోటీసులు…!

ఏపీలో జగన్‌ సర్కార్‌పై విరుచుకుపడే టీడీపీ నేతల్లో వర్ల రామయ్య ముందు వరుసలో ఉంటారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. వర్లరామయ్య పదే పదే విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వర్ల రామయ్యకు ప్రభుత్వం నోటీసులు పంపించింది. తక్షణమే..ఏపీపీయస్సీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని, లేకుంటే తామే తొలగిస్తామంటూ నోటీసులు జారీ చేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా చంద్రబాబు వర్ల రామయ్యకు ఆర్టీసీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టాడు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో నామినేటెడ్ పోస్టులకు ఎన్నికైన వారంతా రాజీనామా చేశారు. అయితే టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్యలు మాత్రం రాజీనామా చేయకుండా తమ పదవులను పట్టుకుని వేలాడుతున్నారు. ఈ క్రమంలో టీటీడీ ఛైర్మన్ పదవిని, బోర్డును ప్రభుత్వం రద్దు చేసింది. కొత్తగా టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డితో పాటు బోర్డు సభ్యులను నిమమించింది. కాగా ఆర్టీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయకుండా కొనసాగుతున్న వర్ల రామయ్యను సాగనంపడానికి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు, కొత్తగా ఆర్టీసీ ఛైర్మన్ నియామకం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో వైసీపీ నేతలు వర్లరామయ్యను తన పదవికి రాజీనామా చేయాలని మీడియాముఖంగా చెప్పారు. అయినా వర్ల రామయ్య మాత్రం రాజీనామా చేయకుండా మొండిగా వ్యవహరిస్తున్నాడు. దీంతో నెల రోజుల్లో స్వచ్ఛందంగా ఆర్టీసీ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలంటూ జగన్ సర్కార్ వర్ల రామయ్యకు నోటీసులు జారీ చేసింది. నెల రోజుల్లోగా రాజీనామా చేయకపోతే తామే తొలగిస్తామని ప్రభుత్వం నోటీసుల్లో పేర్కొంది. అయితే చంద్రబాబు ఫాలో అవుతూ…ప్రతి అంశాన్ని రాజకీయం చేసే వర్ల రామయ్య తనకు వచ్చిన నోటీసులపై ఎలా స్పందిస్తాడో చూడాలి.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat