చెన్నైలో తిరుపతి తిరుక్కుడై ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వార్లు ఈ తిరుపతి తిరుక్కుడై ఉత్సవాన్ని ప్రారంభించారు. హిందూ ధర్మార్థ సమితి ట్రస్ట్ ఈ రోజు ఉదయం జరిగిన సంప్రదాయబద్దంగా జరిగిన ఈ ఉత్సవంలో శ్రీ స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామిజీలు స్వయంగా గొడుగులకు హారతులిచ్చి గరుడసేవకు సాగనంపారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భగా గరుడ సేవలో ప్రదర్శించేంది ఈ గొడుగులనే. తమిళనాడులో ఈ గొడుగుల ఉత్సవాన్ని తిరుపతి తిరుక్కుడై అని పిలుస్తారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు ముందు తిరుపతి తిరుక్కుడై పేరుతో ఈ ఉత్సవాన్ని నిర్వహించడం తమిళనాట ఆనవాయితీగా వస్తుంది. ఈసారి తిరుపతి తిరుక్కుడై ఉత్సవానికి విచ్చేసిన సందర్భంగా చెన్నై విశాఖ శ్రీ శారదాపీఠం భక్తులు నగరమంతగా అంతటా హోర్డింగులు, ఫ్లెక్సీలు, కటౌట్లతో స్వామిజీలకు పెద్దఎత్తున స్వాగతం పలికారు. కాగా నిన్న చెన్నైలో పలువురు ప్రముఖులు స్వామిజీల ఆశీస్సులు పొందారు. అంతే కాకుండా స్వామిజీలకు నగర ప్రముఖులు పుష్పాభిషేకం నిర్వహించారు. చెన్నైలో తిరుపతి తిరుక్కుడై ఉత్సవాన్ని స్వామిజీలు ప్రారంభించిన సందర్భంగా ఏపీ, తమిళనాడు, తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున ప్రముఖులు, భక్తులు చెన్నైకు తరలివచ్చారు. దరువు ఎండీ సిహెచ్. కరణ్రెడ్డి కూడా ఈ తిరుపతి తిరుక్కుడై ఉత్సవంలో పాల్గొన్నారు.