టాలీవుడ్ సీనియర్ నటుడు ,మాస్ మహారాజ్ రవితేజ ఇంతకుముందు తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించిన పాత్రలోనే నటించి మెప్పించబోతున్నారు. తొలిసారిగా విక్రమార్కుడు చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించి తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాడు రవితేజ.
ఆ తర్వాత వచ్చిన పవర్ మూవీలో కూడా అంతకుమించి పాత్రలో నటించి మరోసారి పోలీస్ పాత్రలో తన సత్తాను చాటాడు మాస్ మహారాజ్. తాజాగా మరోసారి అదే పాత్రలో కన్పించబోతున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందించనున్న సరికొత్త చిత్రంలో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా కన్పించనున్నాడు.
ఏపీలోని ఒంగోలు నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఒక ప్రేమ కథ వలన రెండు కుటుంబాల మధ్య ఏర్పడనున్న వైరాన్ని పరిష్కరించనున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న డిస్కో రాజా చిత్రం తర్వాత ఈ మూవీ సెట్ పైకి రానున్నది.