Home / ANDHRAPRADESH / చంద్రబాబు అందుకే ఇల్లు ఖాళీ చేయనని మొండికేస్తున్నాడా..?

చంద్రబాబు అందుకే ఇల్లు ఖాళీ చేయనని మొండికేస్తున్నాడా..?

ఏపీ రాజధాని అమరావతిలో కృష్ణానది కరకట్టపై ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ నివాసం కూల్చివేతకు రంగం సిద్ధం అయింది. ఇప్పటికే ఈ అక్రమనివాసంలోని ప్రజావేదికను కూల్చివేసిన సంగతి తెలిసిందే.. తాజాగా ఆయన నివాసం కూల్చివేతకు సీఆర్‌డీఏ అధికారులు మరోసారినోటీసులు ఇచ్చారు. కాగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కృష్ణానది వరద ముంపుకు ముందే చంద్రబాబు ఇంటితో సహా మరిన్ని అక్రమ కట్టడాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. అయినా చంద్రబాబు మాత్రం ఇల్లు ఖాళీ చేయకుండా రాజకీయం చేస్తున్నాడు. చంద్రబాబు ఇల్లు వరద ముంపుకు గురైన సమయంలో వైసీపీ సర్కార్ తన ఇంటి చుట్టూ డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టిందని, తనకు రక్షణ లేదని చంద్రబాబు గగ్గోలు పెట్టాడు. మా బాబుగారిని ఇంట్లో ఉండనివ్వకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తుందంటూ టీడీపీ నేతలు నిస్సిగ్గుగా ఆరోపణలు చేశారు. ఇక ఎల్లోమీడియా ఛానళ్లు మా కులపెద్దను రాజధానిలో ఉండనివ్వకుండా వైసీపీ ప్రభుత్వం తరిమేస్తుందంటూ పచ్చ కథనాలు వండివార్చాయి. అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం అక్రమ కట్టడాల కూల్చివేతపై రాజీలేని ధోరణితో ముందుకు వెళుతుంది. ఈ మేరకు మరోసారి చంద్రబాబు అక్రమ నివాసం కూల్చివేతకు సీఆర్‌డీఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే చంద్రబాబు మాత్రం హుందాగా తన అక్రమ నివాసాన్ని ఖాళీ చేసి వెళ్లిపోకుండా..తనను ప్రభుత్వం వేధిస్తుందంటూ రాజకీయం చేసి తద్వారా ప్రజల్లో సానుభూతి పొందాలనుకుంటున్నాడు. బాబు తీరుపై వైసీపీ నేతలతో సహా ఏపీ ప్రజలు మండిపడుతున్నారు.

తాజాగా వైసీపీ నేత, లక్ష్మీ పార్వతి చంద్రబాబు అక్రమ నివాసం గురించి స్పందించారు. కరకట్టపై అక్రమంగా కట్టిన ఇంట్లో చంద్రబాబు సీక్రెట్‌గా డబ్బు దాచుకున్నారని లక్ష్మీ పార్వతి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంట్లో భారీగా కోట్లాది రూపాయలు దాచుకోవడం బాబుకు మొదటి నుంచి అలవాటే అని ఆమె చెప్పుకొచ్చారు. ఒక కరకట్ట ఇంట్లోనే కాదు.. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌లో చంద్రబాబు తన కోసం ప్రత్యేకంగా ఓ నేలమాళిగను నిర్మించారని లక్ష్మీ పార్వతి ఆరోపించారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌లో అత్యంత రహస్యంగా ఒక చిన్న గది ఉందని, రాత్రిపూట మాత్రమే చంద్రబాబు ఒక్కరే ఆ రహస్య గదిలోకి వెళతారని, చీమ కూడా ఆ గదిలోకి దూరకుండా..కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారని ఆమె అన్నారు. చంద్రబాబు అక్రమంగా సంపాదించిన లక్షల కోట్ల వ్యవహారాలన్నీ ఆ సీక్రెట్ గదిలోనే ఉంటాయని లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలు చేశారు. ఆ సీక్రెట్ గది గురించి చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన ఒకరిద్దరికి తప్పా మరెవ్వరికి తెలియదని ఆమె అన్నారు. ..కానీ ఏదో ఒక రోజు ఆ గది బయటపడి తీరుతుందని..అప్పుడు చంద్రబాబు అక్రమ సంపాదన బండారం బట్టబయలవుతుందని లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలు చేశారు. మొత్తంగా కరకట్టపై ఉన్న అక్రమ నివాసంలోను, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లోను సీక్రెట్ గదులను నిర్మించుకుని కోట్లాది రూపాయలు దాచుకున్నారంటూ లక్ష్మీ పార్వతి చేసిన ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మరి లక్ష్మీ పార్వతి చేసిన ఆరోపణలపై చంద్రబాబు, లోకేష్‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat