ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు చేసి ఆయన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాడనే కారణంతో శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గానికి చెందిన జనసేన కార్యకర్త పనతల హరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం జగన్పై ఫేస్బుక్లో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టాడంటూ అతనిపై వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో హరిపై కేసు నమోదు చేసిన గుంటూరు పోలీసులు హరిని అదుపులోకి తీసుకోవాల్సిందిగా రాజాం నియోజకవర్గంలోని రేగిడి పోలీసులను కోరారు. ఈవిధంగా గుంటూరు పోలీసుల విజ్ఞప్తి మేరకు రేగిడి హరిని అరెస్ట్ చేసిన క్రమంలో అతను భయాందోళనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో హరిని అడ్డుకుని పోలీసులు గుంటూరు పోలీసులకు అప్పగించారు. అయితే హరి గతంనుంచి జగన్ పై చెప్పలేని భాషతో రాస్తూ పోస్టులు పెట్టేవాడు. వ్యాధి గ్రస్తుల పొటోలకు జగన్ ఫొటోలు మార్ఫింగ్ చేయడం, వైఎస్ కుటుంబసభ్యులను అవమానించడం వంటివి చేసాడు. ఈ క్రమంలో అతనిపై చర్యలు తీసుకున్నారు.