మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి గాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాణ భాద్యతలు తీసుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నాలుగు బాషల్లో విడుదల కానుంది. వెయ్యి కళ్ళతో అభిమానులకు ఇంకా కొన్ని గంటల్లో కల నెరవేరబోతుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్లు ఫుల్ అయిపోయాయి. టికెట్స్ దొరకక చాలామంది ఈరోజు నుండే థియేటర్లు ముందు పడిగాపులు కాస్తున్నారు. ఎంత ఖర్చు ఐనా పర్లేదు సినిమా చూడాల్సిందే అంటున్నారు. మరి సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది రేపటివరకు వేచి చూడాల్సిందే.