Home / ANDHRAPRADESH / లీడర్‌కు మానిప్యులేటర్‌కు తేడా అదే బాబూ…ఇకనైనా మారితే మంచిది!

లీడర్‌కు మానిప్యులేటర్‌కు తేడా అదే బాబూ…ఇకనైనా మారితే మంచిది!

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ధ్వజమెత్తారు.వేతనాల సంగతెలా ఉన్నా పదవీ విరమణ వయసును ప్రభుత్వ ఉద్యోగుల్లాగా 60 ఏళ్లకు పెంచమని ఆర్టీసీ కార్మికులు ప్రాధేయ పడితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జీతాలే దండగ అంటూ హేళన చేశాడు. ఆ విషయాలు ఎవరూ మర్చిపోరు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబరు1 నుంచే రిటైర్మెంటు ఏజ్ పెంచి మానవతను ప్రదర్శించారు. లీడర్‌కు మానిప్యులేటర్‌కు తేడా అదే చంద్రబాబు అని అన్నారు. ఇక మరో ట్వీట్ లో ఐదేళ్ల పదవీ కాలంలో తన పార్టీకి నిధులు సమకూర్చే బడా కాంట్రాక్టర్లకు లక్ష కోట్లు దోచి పెట్టాడు. ఇంటికో ఉద్యోగమని మోసం చేసి ఎన్నికల ముందు వెయ్యి పెన్షన్ చేతిలో పెట్టాడు. ఇప్పుడు కూడా కాంట్రాక్టర్ల బకాయిల గురించి ఆందోళన చెందుతున్నాడు తప్ప ప్రజల సాధక బాధల గురించి మాట్లాడడు అని చంద్రబాబుపై మండిపడ్డారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat