ప్రభుత్వం ప్రతీపనిలో చిత్తశుద్ధి, పారదర్శకతతో ముందుకు వెళ్తుందని, నాలుగునెలలల్లో 4లక్షల ఉద్యోగాలిచ్చిన దమ్మున్న నాయకుడు సీఎం జగన్ అని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కరపలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో కన్నబాబు మాట్లాడుతూ ప్రజారంజక పాలన అందిస్తూ దేశంలోనే ఆదర్శ ప్రాయుడిగా జగన్ మారారన్నారు. 2019 ఎన్నికల శంఖారావాన్ని కాకినాడ నుంచే జగన్ పూరించారు. దేశంమొత్తం తిరిగి చూసే విధంగా ఎన్నికల ఫలితాల్లో 151 అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీస్థానాలు సాధించి లీడర్ అంటే ఇతనని దేశానికి చూపించారన్నారు. గత ప్రభుత్వ పథకాలు చాలా ప్రవేశపెట్టాయి.
కానీ ఒక వ్యవస్థ రూపొందించి దాన్ని అమలు చేయడానికి దమ్ముండాలన్నారు. అలాంటి దమ్మున్న నాయకుడు జగన్ అన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసుకున్నా ఒక్క జాబు రాలేదని, జగన్ సీఎం అయ్యాక యువత అంతా జగనన్న వచ్చాడు. జాబు ఇచ్చాడని నినదిస్తుందన్నారు. ప్రజల ముందుకు నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్ తీసుకువచ్చారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు జగన్ నాయకత్వాన్ని అనుసరించాల్సిందేనన్నారు. దశలవారీగా మద్య నిషేధం నిన్నే ప్రారంభమైందని, ప్రతి అడుగులోనే జగన్ మార్కు కనిపిస్తుంది. ఇలాంటి పరిపాలనలో భాగస్వాములం అయినందుకు గర్వపడుతున్నానని కన్నబాబు అన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని చేతల్లో చూపించిన మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ అన్నారు కన్నబాబు.