తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి విదితమే. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన మంత్రి నరేందర్ మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీకి ఇరవై మూడు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ఇరవై నాలుగు నుంచి నలబై రెండుకు పెంచాలి. తెలంగాణలో ఐఐఎంను ఏర్పాటు చేయాలి. ఖమ్మం జిల్లాలో బయ్యారం స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలి. కంటోన్మెంట్ భూములను రాష్ట్ర ప్రభుత్వానికివ్వాలి. మిషన్ భగీరథ,కాకతీయకు ఇరవై నాలుగు వేల కోట్లను ఇవ్వాల్సిందిగా సీఎం కేసీఆర్ ప్రధానిని ఆ వినతి పత్రంలో కోరారు.