Home / ANDHRAPRADESH / వరంగల్‌లో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి ప్రెస్‌మీట్..!

వరంగల్‌లో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి ప్రెస్‌మీట్..!

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో హిందూ ధర్మ ప్రచారయాత్ర దిగ్విజయవంతంగా సాగుతున్న సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ విశాఖ శారద ఉత్తర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ  స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పాత్రికేయులను ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పత్రికా, మీడియా ప్రతినిధులతో స్వామివారు మాట్లాడారు. 2004 నుంచి శారదా పీఠం అనుబంధం వరంగల్ కి ఉందని గుర్తు చేశారు. తన హిందూ ధర్మ ప్రచార యాత్ర గురించి కూలంకుశంగా వివరించారు. దేశంలోనే హిందువుల పండుగలు కుటుంబం, కుటుంబం జరుపుకునే రాష్ట్రం తెలంగాణ అని, నవరాత్రి ఉత్సవాలు బతుకమ్మ పండుగ ఇలా చాలా ఉన్నాయని స్వామివారు అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మారు మూల గ్రామాల్లో కూడా తన హిందూ ధర్మ ప్రచార యాత్ర కొనసాగుతుందని స్వామి వారు తెలిపారు. ఈ సందర్భంగా విశాఖ శ్రీ శారదా పీఠానికి 2004 నుండి భక్తులుగా ఉన్న కెప్టెన్ లక్ష్మీ కాంత్ రావు కుటుంబాన్ని స్వామివారు గుర్తుచేసుకున్నారు. మాజీ భారత ప్రధాని స్వర్గీయ శ్రీ పీవీ నర్సింహ రావు గారు వంగర గ్రామంలో ఆలయాన్ని ప్రారంభించడానికి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానంద సరస్వతి మహాస్వామివారిని ఆహ్వానించిన నాటి నుండి కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబంతో తమకు ఆధ్యాత్మిక బంధం ఏర్పడింది అని స్వామి వారు అన్నారు. ఇప్పుడు వరంగల్ పర్యటనలో ఉన్న తనకు కూడా తమ గురువు స్వరూపానంద సరస్వతి గారితో వచ్చినపుడు ఎలక్ట్రానిక్ మరియు ప్రెస్ మీడియా మిత్రులతో మంచి అనుబంధం ఏర్పడిందని స్వామివారు తెలియజేసారు. ఇదే క్రమంలో జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు స్వామివారు చక్కగా సమాధానం చెప్పారు కశ్మీర్ ఆర్టికల్ 370 గురించి రద్దుపై మీ అభిప్రాయం ఏంటని.. ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు స్వామివారు ఆసక్తిగా సమాధానం చెప్పారు. తాను వయసులో చాలా చిన్న వాడినని, అయినా దేశం మొత్తం ఐక్యంగా ఉండేందుకు చాలా పొరాటలు జరిగాయని, ఇప్పుడు ఆ అవసరం ఇక ఉండదని, ఇప్పుడు కేవలం దేశం అభివృద్ధి కోసం మాత్రమే యుద్ధం చెయ్యాలని స్వామివారు పేర్కొన్నారు. ఈ ప్రెస్‌మీట్‌లో హుస్నాబాద్ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ , స్వామి వారి రెండు రాష్ట్రాల సమన్వయకర్త, దరువు ఎండీ సీహెచ్ చెరుకు కరణ్ రెడ్డి, వరంగల్ ఉమ్మడి జిల్లాల సమన్వయ కర్తలు రాంమూర్తి పోలపల్లి, రోహిత్, శ్రీను ఇతర ప్రముఖ ప్రెస్ మీడియా మిత్రులు పాల్గొన్నారు. ప్రెస్‌మీట్ అనంతరం అందరికీ స్వామి వారు ప్రసాదాలు అందజేశారు. స్వామివారి ప్రెస్‌మీట్ ఆద్యంతం  ఆసక్తికరంగా సాగింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat