కమెడియన్ గా ఎంట్రీచ్చి ఒక పెద్ద నిర్మాతగా మారిన బండ్ల గణేష్ పరారీలో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన టెంపర్ మూవీని బండ్ల గణేష్ నిర్మించారు. ఈ చిత్రం నిర్మాణం కోసం బండ్ల ప్రముఖ వ్యాపారవేత్త ,వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ దగ్గర ముప్పై కోట్లు అప్పుగా తీసుకున్నారు.
అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వాల్సిందిగా పీవీపీ కోరితే గణేష్ తన అనుచరులతో కల్సి నిన్న శుక్రవారం రాత్రి బెదిరించారు. దీంతో పీవీపీ హైదరాబాద్ మహానగరంలోని జూబ్లిహీల్స్ పీఎస్ లో పిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు. బండ్ల గణేష్ పరారీలో ఉన్నారని వార్తలు వస్తోన్నాయి.