ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి మండిపడ్డారు. దీనిపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబు పై విరుచుకుపడ్డారు.అమరావతి ప్రపంచ స్థాయి సిటీ, రెండో టోక్యో అవుతుందని మొన్నటి దాకా ప్రజెంటేషన్లతో చావగొట్టిన చంద్రబాబ ఇప్పడేమో సోషల్ మీడియాలో దుర్భాషలాడుతున్నారని ఎవరూ పట్టించుకోని పోస్టులను అందరికీ చూపించాడు. పాతాళంలోకి జారి పోయాడు. ఎన్ని జాకీలు పెట్టినా పచ్చ మీడియా బయటకు లాగలేదు అని అన్నారు. తప్పు ఆరోపణలు చేస్తూ తన స్థాయిని దిగజార్చుకోవడం చంద్రబాబుకు అలవాటే అని అన్నారు.
అమరావతి ప్రపంచ స్థాయి సిటీ, రెండో టోక్యో అవుతుందని మొన్నటి దాకా ప్రజెంటేషన్లతో చావగొట్టాడు. ఇప్పడేమో సోషల్ మీడియాలో దుర్భాషలాడుతున్నారని ఎవరూ పట్టించుకోని పోస్టులను అందరికీ చూపించాడు. పాతాళంలోకి జారి పోయాడు. ఎన్ని జాకీలు పెట్టినా పచ్చ మీడియా బయటకు లాగలేదు. @ncbn
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 5, 2019