తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఓ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. ఈ నిర్ణయం ద్వారా జగన్ ఓ స్పష్టమైన సంకేతాన్ని ప్రజలకు ఇచ్చారు. తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం దేశంలోని ముఖ్యమంత్రులు అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంపీడీవో సరళ అనే మహిళపై అనుచితంగా మాట్లాడారని తన ఇంటిపై దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదుపై ప్రభుత్వం స్పందిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఈ విషయం వాస్తవమా లేదా కావాలనే చేశారా అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది.
అయితే జగన్ నిజానిజాల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆ ఎమ్మెల్యే ను అదుపులోకి తీసుకోవాలని నేరుగా డీజీపీకి చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ రోజు ఉదయం 5 గంటలకు ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు. జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇక ఈ విషయంలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు చేయలేనిది..జగన్ చేసి చూపించాడు. టీడీపీ లో ఎంతో మంది నాయకులు తప్పుడు పనులు చేసారు. దానికి సంబంధించి నేరుగా చంద్రబాబుకే పిర్యాదు చేసాని. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళపై దౌర్జన్యం చేయించాడు తప్ప. తప్పు చేసినవారిని కాపాడుకుంటూ వచ్చాడు..ఇందులో ముఖ్యంగా చింతమనేని విషయానికి వస్తే మరీ దారుణమని చెప్పాలి.