ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేందర్ మోదీ బాటలో నడవనున్నారా..?. ఇప్పటికే స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో ప్రధాన మంత్రి నరేందర్ మోదీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి విధితమే. దీనికోసం కేంద్ర సర్కారు మూడు వేల కోట్లను ఖర్చు చేసింది అని కూడా సమాచారం.
తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో రాష్ట్రంలో గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టు దగ్గర నలబై ఐదు అడుగులతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు పులిచింతల ప్రాజెక్టు దగ్గర స్థలాన్ని పరిశీలిస్తున్నాము. ఇక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్మృతి వనం ,పార్కును కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.