తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ ఆమోస్ గారి మృతిపై మంత్రి హరీశ్ రావు గారు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. నమ్మిన విలువలకు జీవితాంతం కట్టుబడిన ఆమోస్ను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.
‘స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ఉద్యమంలో పాల్గొనడం వల్ల ఉద్యోగం కోల్పయిన తొలి వ్యక్తి ఆమోస్. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నారని నాటి ప్రభుత్వం ఆయనను డిస్మిస్ చేసింది.
మృదు స్వభావి అయిన ఆమోస్ తాను నమ్మిన విలువల విషయంలో రాజేపడేవారే కాదు. తెలంగాణ ప్రయోజనాల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి మరువలేనింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాని అన్నారు…