తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే కంటి వెలుగు కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే. కంటి వెలుగు పరీక్షల్లో భాగంగా కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు సరఫరా చేస్తుంది ప్రభుత్వం.
మరి అవసరమైతే ఉచితంగా ఆపరేషన్లు,కండ్లద్దాలను కూడా ఇస్తుంది. తాజాగా మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఇందులో భాగంగా ప్రతి ఇంటింటికీ వెళ్ళి ఉచితంగా క్యాన్సర్ పరీక్షల కార్యక్రమాన్ని తెరపైకి తెస్తుంది.
ఈ కార్యక్రమం ద్వారా రొమ్ము,నోటి క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి .ఉచితంగా మందులు.. అవసరమైన చికిత్సలు చేయడానికి సిద్ధమవుతుంది.అయితే గర్భాశయ క్యాన్సర్ పరీక్షలను ఇప్పటికే ఉచితంగా పీహెచ్ సీలలో నిర్వహిస్తున్నారు. క్యాన్సర్ పరీక్షల కార్యక్రమాన్ని ముందుగా పన్నెండు జిల్లాలో ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికోసం నర్సులకు ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చింది ప్రభుత్వం..