Home / ANDHRAPRADESH / శభాష్ సీఎం జగన్..నిజమైన పేదవారికి న్యాయం అంటే ఇదే

శభాష్ సీఎం జగన్..నిజమైన పేదవారికి న్యాయం అంటే ఇదే

ముఖ్యమంత్రి సహాయనిధికి సైతం ‘పచ్చ’ రోగం తప్పలేదు. ఆనాటి ప్రభుత్వం ఎంతో పవిత్రమైన ముఖ్యమంత్రి సహాయనిధిని కూడా విడిచిపెట్టలేదు. సీఎమ్మారెఫ్ విభాగంలో దాదాపు 22 వేల ఫైళ్లు మూలాన పడివున్నాయి. వేలకొద్దీ చెల్లని చెక్కులు ఇచ్చారు. ట్రీట్మెంట్ ఇచ్చిన ఆస్పత్రులకు వందల కోట్లు బిల్లులు ఎగనామం పెట్టారు. వారికీ కావలసిన ఆసుపత్రులకు మాత్రం బిల్లులు క్లియర్ చేసేసారు. బాబుగారి ప్రభుత్వం ఇచ్చిన 8700 చెక్కులు చెల్లకుండా పోయాయి. ఎల్వోసీలు, రీఎంబెర్స్మెంట్లోనూ బాబుగారి ముద్ర తప్పలేదు. వాటిలో కూడా తమ కులంవాళ్లకే మరీముఖ్యంగా తమ పార్టీవాళ్లకే ప్రాధాన్యత ఇచ్చారు.

వారి ఆసుపత్రులకే ..
కేవలం కొద్దిమంది పచ్చ ఎమ్మెల్యేలు కొన్ని అనుకూల ఆస్పత్రులు 80 శాతం పైగా సహాయ నిధిని దోచుకున్నాయి.ఈ అవినీతిని దందా ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగా సాగడం ఆశ్చర్యకరం. ముఖ్యమంత్రి సహాయ నిధి పేరుతో వివిధ సంస్థల,ప్రజల నుండి సేకరించిన విరాళాలు ఏమయ్యాయో దేవునికే ఎరుక. వెరసి పటిష్టమైన బ్రోకర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని మరి ముఖ్యమంత్రి సహాయనిధిని భోంచేశారు.అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు ఆసుపత్రులు కుమ్ముకై పేదల సొమ్మును పందికొక్కుల్లా మింగేశారు.

జగన్ సీఎం అయ్యాక.. ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో
జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక ముఖ్యమంత్రి సహాయనిధి పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్రమాలకు ఒక్కొక్కటిగాతెరదించుతున్నారు. సమర్ధులైన నిజాయితీపరులైన అధికారులు,సిబ్బంది పర్యవేక్షణలో ప్రతి పైసా పేదవారికి చెందాలన్న ముఖ్యమంత్రి గారి ఆదేశాలు సహకారం అవుతున్నాయి. ప్రత్యేక అధికారి డాక్టర్ హరికృష్ణ, సిబ్బంది ఆచితూచి వ్యవహరిస్తూ, ప్రతి పైసా సద్వినియోగానికి కృషి చేస్తున్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధిలో ప్రక్షాళన..
అక్రమాలుఅరికట్టడానికి గతంలోని పాత బ్యాంక్ అకౌంట్ మూసివేసి, కొత్త ఎకౌంట్ను ప్రారంభించారు. దళారీ వ్యవస్థ నిర్మూలించడానికి ఎల్వోసీలను నేరుగా రోగుల బంధువులకే ఇస్తున్నారు. లంచాలు, కమిషన్లు తీసుకుంటున్నవారిపై, బ్రోకర్ల పై ఉక్కు పాదం మోపుతున్నారు. దొంగబిల్లులు పెడుతున్న వ్యక్తులపై , ఆసుపత్రులపై పోలీసు కేసులు కూడా పెడుతున్నారు. సిబ్బందిపై కూడా చర్యలకు వెనకాడటం లేదు. దృష్టి కి వచ్చిన అక్రమాలన్నీ ఎప్పటికప్పుడు విజిలెన్స్ వారికి పంపుతున్నారు. మరోవైపు రోగులు ఇబ్బంది పడకుండా,ఏరోజు ఎల్వోసీ లను అదే రోజు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసరమైన వాటికి సెలవు రోజుల్లో కూడ ఎల్వోసీ లను మంజూరు చేస్తున్నారు.(మానవతా దృక్పథంతో) పేద రోగులకు సరైన ఆసుపత్రులను, మంచి వైద్యులను సైతం సూచిస్తుండడంవిశేషం.
కొత్త ప్రభుత్వం వచ్చాక…
దాదాపు 2421 ఎల్వోసీలను,2749మెడికల్రియింబర్సుమెంట్లు, 21 పైనఫైనాన్షియల్ అసిస్టెన్స్ కలుపుకొని మొత్తం 5191 దరఖాస్తులను పరిశీలించి దాదాపు 52 కోట్లు మంజూరు చేయడం విశేషం. ఈ ప్రక్షాళన చర్యల్లో రియింబర్సుమెంట్లు కాస్త ఆలస్యమైనా, ఎల్వోసీ లనుసత్వరం మంజూరు చేస్తున్నారు. ఈ చర్యలన్నీ నిజమైన పేదవారికి న్యాయం జరిగే దిశగా సాగుతుండటం సంతోషకరం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat