తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో యూటర్న్ తీసుకుని ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ హవా, పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాజకీయపరంగా చంద్రబాబు తీసుకున్న ఈ సంఖ్య అన్న సరే అతిశయోక్తి కాదు. అయితే 2015 నుంచి చంద్రబాబు బీజేపీ ఓటమి కోసం పనిచేస్తానని ఢిల్లీ వేదికగా బీజేపీ వ్యతిరేక పక్షాలతో సభలు సమావేశాలు సైతం నిర్వహించారు. ముఖ్యంగా బిజేపి వ్యతిరేకంగా చంద్రబాబు ఇతర రాష్ట్రాలకు వెళ్లి మరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో నరేంద్ర మోడీ పైన పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.
ఆంధ్రప్రదేశ్లో ధర్మ పోరాట దీక్ష పేరుతో మోడీని ఇష్టానుసారంగా తిట్టారు. అయితే దేశ వ్యాప్తంగా మోడీకి క్రేజ్ 2014 కంటే 19కి పెరిగింది అనే విషయం ఎన్నికల ఫలితాల తర్వాత స్పష్టంగా అర్థమైంది. అయితే ప్రస్తుతం జగన్ వైసీపీ అధికారంలో ఉండడం పట్ల ఒంటరిగా ఏమీ చేయలేం అనే భావన చంద్రబాబు లో పెరిగిపోతున్న క్రమంలోనే మరోసారి కాంగ్రెస్ లేదా జనసేన ప్రజలు హర్షించరు అని అర్థం చేసుకున్న చంద్రబాబు బీజేపీ దగ్గర వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఉదాహరణ. తాను మోడీని రాష్ట్రానికి రావాల్సిన నిధులు విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించిన తప్ప వ్యక్తిగతంగా కానీ పార్టీ సిద్ధాంత పరంగా గానీ తనకు విభేదాలు లేవని అంటున్నారు. ఈ వ్యాఖ్యలతో మరోసారి బీజేపీ కి చంద్రబాబు దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నటు అర్థమవుతుంది.