ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్ర పరిధిలోని ఉద్యోగులకు శుభవార్తను తెలిపింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం పెంచిన కేంద్ర ప్రభుత్వం తాజాగా రవాణా భత్యాన్ని కూడా పెంచింది.
ఆయా శాఖాల్లో పని చేసే ఉద్యోగులకు పని చేస్తున్న ప్రాంతాలను బట్టి పెంచింది. పెద్ద పెద్ద నగరాల్లో ఉంటున్న ఉద్యోగులకు కనిష్ఠంగా రూ.1350,గరిష్ఠంగా రూ.7200 లు టీఏ గా చెల్లించనున్నారు.
అయితే చిన్న చిన్న పట్టణాల్లో కనిష్టంగా రూ.900,గరిష్ఠంగా రూ.3600లు ఇస్తారు. తాజా పెంపుతో ప్రతి ఉద్యోగి నెలవారీ మొత్తం కనిష్టంగా రూ.810,గరిష్టంగా రూ.4320లు చేతుల్లోకి తీసుకొనున్నారు.