వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కొన్ని ఆటుపోట్లకు గురవుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కూడా వారికి హామీ ఇచ్చారు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు తీస్తున్నాం పారదర్శకంగా ఇస్తున్నాం వీటిలో చాలా మంది నిరుద్యోగులు కవర్ అవుతారు. అయితే వాలంటీర్ల ద్వారా ఇచ్చే ఉద్యోగాల్లో పెద్దఎత్తున వైసీపీ శ్రేణుల కు ఉద్యోగాలు వస్తాయని భావించారు. కానీ అవి కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తికి వెళ్లడంతో వైసిపి సోషల్ మీడియా టీం తీవ్రంగా నిరాశకు గురైంది. ముఖ్యంగా సోషల్ మీడియాకు సంబంధించి పై స్థాయిలో ఉన్న కింది స్థాయిలో పట్టించుకునే నాధుడు లేడు. అసలు విషయానికొస్తే బీజేపీ సోషల్ మీడియా స్వయంగా నరేంద్రమోడీ పర్యవేక్షిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాను స్వయంగా నారా లోకేష్ చంద్రబాబులు పర్యవేక్షిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కూడా ఆ పార్టీ అగ్రనేతలు పర్యవేక్షిస్తున్నారు. కానీ వైఎస్ఆర్సిపికి సంబంధించిన సోషల్ మీడియా కనీసం పట్టించుకోవట్లేదు అంటూ వారు వాపోతున్నారు.
పార్టీకి సంబంధించి కొంత మంది వ్యక్తులు నియమించిన పార్టీ అనుబంధ సంస్థగా వారెవరు అందుబాటులో ఉండటం లేదని పార్టీ సిద్ధాంతాలను బలంగా తీసుకెళ్లాల్సిన సమయంలో ఈ పరిస్థితి ఉత్పన్నం కావడం అంటున్నారు. తాజాగా జూపూడి చేరిన సమయంలో పార్టీ స్టాండ్ ఒకటైతే పార్టీ సోషల్ మీడియా స్టాండ్ మరొకటి అయ్యింది. ఇలాంటి అనుభవాలు పార్టీలో కోకొల్లలుగా ఉన్నాయి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం విషయాన్ని ప్రణాళికబద్ధంగా ప్రజలకు చేరవేయడం గ్రామ సెక్రటరీ ఉద్యోగాల విషయంలో పార్టీ సిద్ధాంతం ప్రభుత్వ విధానం ఇలా అన్ని కలగలుపుగా ఉండడం పట్ల సరైన గైడెన్స్ లేదు అంటూ స్వచ్ఛందంగా పార్టీ కోసం పని చేసే వారు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.