హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున పోటికి దిగిన శానంపూడి సైదిరెడ్డికి నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నియోజకవర్గంలో సైదిరెడ్డి ఎక్కడకెళ్లిన ప్రజలు ఎదురు వచ్చి మరి హారతులు పడుతున్నారు. అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తోన్న టీఆర్ఎస్ పార్టీకే ప్రజా ఆదరణ లభిస్తుందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి సత్యవతి గరిడేపల్లి,మఠంపల్లి మండల్లాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ” తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడైన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నియోజకవర్గానికి చేసింది ఏమి లేదు. నియోజకవర్గంలోని ఎస్టీలను,గిరిజనులను ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగానే చూశారని ఆమె దుయ్యపట్టారు.
అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం తండాలను,గూడెలను పంచాయతీలుగా చేసి ఎన్నో దశాబ్ధాల ఎస్టీల చిరకాల కోరికను నెరవేర్చి.. గ్రామ స్వరాజ్యం తీసుకు వచ్చింది అని ఆమె అన్నారు.
గిరిజనులకు,ఎస్టీలకు కేసీఆర్ సర్కారు ఎక్కువ నిధులను కేటాయించి వారి అభ్యున్నతికై పాటు పడుతుందని.. అందుకే టీఆర్ఎస్ పార్టీని ఎస్టీలు,గిరిజనులు గుండెలకు హత్తుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరగనున్న ఉప ఎన్నికల పోలింగ్ లో కారు గుర్తుకే మీ అమూల్యమైన ఓటును వేసి శానంపూడి సైదిరెడ్డిని ఆశీర్వదించి గెలిపించి మరి అసెంబ్లీకి పంపించాలని ఆమె కోరారు.