సినీ దిగ్గజం మెగాస్టార్ చిరంజీవి నిన్న సీఎం జగమ్ మోహన్ రెడ్డిని తన నివాసంలో చిరు దంపతులు కలిసిన విషయం తెలిసిందే. సైరా సినిమా సక్సెస్ తో జోష్ మీదున్న చిరు ఆ సినిమాను చూడాల్సిందిగా సీఎంను అడిగేందుకు తాను వెళ్లినట్టుగా చెప్పారు. దాదాపుగా గంటకు పైగా జగన్ తో భేటీ అయిన చిరు ఆ తరువాత డైరెక్ట్ గా హైదరాబాద్ కు వెళ్లారు. అయితే తాజాగా జగన్ తో జరిగిన సంభాషణ గురించి చెప్పిన చిరు సినీ పరిశ్రమకు ఏది కావాలన్నా తానెప్పుడూ ముందుంటానని వైఎస్ జగన్ చెప్పారని చెప్పారు. ఏది కావాలన్నా అడగడానికి ఏ మాత్రం సంకోచించవద్దని అన్నారు. వైఎస్ జగన్ సహాయం చేసే గుణానికి నాకు చాలా సంతోషమేసింది. కుటుంబ సభ్యులతో గడిపిన అనుభూతి కలిగిందని చిరంజీవి చెప్పుకొచ్చారు