తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరగనున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికలో బాగంగా నేరేడుచర్ల భూపోరాట కమిటి తమ మద్దతును టీఆర్ఎస్ అభ్యర్ది శానంపూడి సైది రెడ్డికి ప్రకటించించింది..
వెలుగు వనితక్క గారి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి తూర్పు ఎమ్మెల్యే నేరేడుచర్ల టౌన్ ఎన్నికల ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ హాజరయ్యారు.ఈ సందర్బంగా టీఆర్ఎస్ కు తమ మద్దతును ప్రకటించినందుకు దన్యవాదాలు తెలిపారు.
తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెలతామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ముఖ్య నాయకులు,భూపోరాట కమిటి ప్రతినిధులు దేవమ్మ,పర్వత,దానమ్మ,మల్లేశ్వరి,సైదాభీ తదితరులు పాల్గొన్నారు.