ఐపీఎల్ లో బలమైన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటీ అనడంలో సందేహమే లేదని చెప్పాలి. ఆ జట్టు ఎంత బలమైనదో అందరికి తెలిసిన విషయమే. అయనప్పటికీ ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. ఐపీఎల్ లో ఆ జట్టు మూడుసార్లు ఫైనల్ కు చేరుకుంది కాని ఫైనల్ లో చేతులెత్తేసింది. చివరిగా 2016లో ఫైనల్ లో హైదరాబాద్ జట్టుపై ఓడిపోయింది. ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయానికి వస్తే ఆ జట్టుకు డెత్ బౌలింగ్ నే ప్రదాన కారణమని చెప్పాలి. కాబట్టి ఐపీఎల్ 2020 వేలంలో నాణ్యమైన డెత్ బౌలర్లను కొనుగోలు చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా పార్థివ్ పటేల్తో ఇన్నింగ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ఒకరూ కావాలి. ఈ మేరకు వాళ్ళు వెస్టిండీస్ ప్లేయర్ లెండీ సిమ్మన్స్, షెల్డన్ కాట్రెల్ మరియు ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ వోక్స్ ను తీసుకోవాలనుకుంటున్నారని తెలుస్తుంది.