Home / SPORTS / ఆ ముగ్గురిపై కన్నేసిన ఆర్సీబీ..వర్కౌట్ అవుతుందా..?

ఆ ముగ్గురిపై కన్నేసిన ఆర్సీబీ..వర్కౌట్ అవుతుందా..?

ఐపీఎల్ లో బలమైన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటీ అనడంలో సందేహమే లేదని చెప్పాలి. ఆ జట్టు ఎంత బలమైనదో అందరికి తెలిసిన విషయమే. అయనప్పటికీ ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. ఐపీఎల్ లో ఆ జట్టు మూడుసార్లు ఫైనల్ కు చేరుకుంది కాని ఫైనల్ లో చేతులెత్తేసింది. చివరిగా 2016లో ఫైనల్ లో హైదరాబాద్ జట్టుపై ఓడిపోయింది. ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయానికి వస్తే ఆ జట్టుకు డెత్ బౌలింగ్ నే ప్రదాన కారణమని చెప్పాలి. కాబట్టి ఐపీఎల్ 2020 వేలంలో నాణ్యమైన డెత్ బౌలర్లను కొనుగోలు చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా పార్థివ్ పటేల్‌తో ఇన్నింగ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ఒకరూ కావాలి. ఈ మేరకు వాళ్ళు వెస్టిండీస్ ప్లేయర్ లెండీ సిమ్మన్స్, షెల్డన్ కాట్రెల్ మరియు ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ వోక్స్ ను తీసుకోవాలనుకుంటున్నారని తెలుస్తుంది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat