హేమాహేమీ నాయకులను, మేధావులను రాజకీయాల్లోకి లగాలంటే అది నారా ఫ్యామిలీకే సాధ్యమని చెప్పాలి. అబ్దుల్ కలాం వంటి మహనీయుడు విషయంలో కీలక పాత్ర పోషించింది మేమేనంటూ డప్పు కొట్టుకుంటున్నారు. మావల్లే ఆయన రాష్ట్రపతి అయ్యారంటూ తప్పుడు కూతలు కూస్తున్నారు. రాష్ట్రపతి అబ్దుల్ కలాం విషయానికి వస్తే ఆయన ఎటువంటి వ్యక్తో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడుతారు. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుంటారు. ఏదైనా చేస్తే చేసానని అంటారు తప్పు చెయ్యకుండా చేసానని మాత్రం చెప్పుకోరు. నిజంగా చంద్రబాబు వల్లే కలాం గా ఆ పదివిలో ఉన్నారంటే ఆయనే స్వయంగా యావత్ ప్రజానికానికి తెలియజేస్తారు. ఇప్పటికీ ఇంకా అదే చెప్పుకుతిరుగుతున్నారు. ఈ మాట విన్న ప్రజలు ఛీదరించుకుంటున్నా లెక్క చేయకుండా తుడుచుకొనిపోతున్నారు.
ఇక లోకేష్ గారి విషయానికి వస్తే మన అందరికి తెలిసిన విషయమే ఏదైనా చెప్పాలన్నా మనం వినాలన్నా మనకి ధైర్యం ఉండాలి తప్పా ఎన్ని కట్టుకధలైన చెబుతారు. తాజాగా మరో కట్టుకధ రివీల్ చేసాడు.ప్రస్తుతం ఈ వీడియో భారీగా వైరల్ అవుతుంది.ఇక అసలు విషయానికి వస్తే 2012లో వాజ్ పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు రాష్ట్రపతిగా ఎవరిని నియమించాలి అనే అంశంపై చంద్రబాబుని కోరారట. దాంతో బాబుగారు వెంటనే కలాం గారి పేరు సిఫారస్సు చేసారని.. మరి ఆయన ఒప్పుకుంటారా అని అడిగితే నేను ఉన్నానుకదా చూసుకుంటా అని భరోసా కూడా ఇచ్చారట. ఈ మాట విన్న మన్మోహన్ గారు ఒక్కసారిగా అవాక్ అయ్యారట. 2012 ఆయన ప్రధాని అయితే మరి నేనెవరిని అని అనుకున్నారట. ఏంటో ఈ చినబాబు మాటలు లేపి తన్నించుకున్నట్టే ఉన్నాయిగా…!