వీరేంద్ర సెహ్వాగ్ ఈ పేరు తెలియని టీమిండియా తో పాటు ప్రపంచ క్రికెట్ అభిమానులుండరంటే అతిశయోక్తి కాదేమో. అంతగా తన ఆటతీరుతో అభిమానులను సొంతం చేసుకున్నాడు. క్రికెట్ నుంచి విరామం తీసుకున్న సెహ్వాగ్ సోషల్ కార్యక్రమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉంటున్నాడు. మరీవైపు సోషల్ మీడియాలో తనదైన శైలీలో ప్రతి అంశం గురించి స్పందిస్తూ నెటిజన్ల చేత జైహో అన్పించుకుంటున్నాడు.
వీరు తాజా ట్వీటుతో నెటిజన్ల మదిని మరోకసారి కొల్లగొట్టాడు. గతంలో జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో నలబై మంది సీఆర్ఫీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి విదితమే. వీరిలో కొంతమంది పిల్లలను వీరు తనకు చెందిన అంతర్జాతీయ స్కూల్ లో చదివిస్తున్నాడు. ఈ క్రమంలో వారు క్రికెట్లో కూడా శిక్షణ పొందుతున్న ఫోటోలను వీరు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు.
వీరంతా సైనిక హీరోల కుమారులు. మరి ముఖ్యంగా ఆ ఇద్దరు ఇక్కడ ఉండటం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. బ్యాటింగ్ చేస్తున్న కుర్రాడు అమరుడు జవాన్ రాం వకీల్ కుమారుడు .. బౌలింగ్ చేస్తున్న కుర్రాడు అమర జవాన్ విజయ్ సోరెంగ్ కుమారుడు . వీరికి సేవ చేయడం కంటే ఇంకా మించిన ఆనందం ఏముంటుంది అని పోస్టు చేశాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ” దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల కుమారులకు అండగా నిలిచిన మీరు ఇంకా గొప్పవారు. సెహ్వాగ్ జైహో అంటూ ట్వీటులు చేస్తున్నారు.