Home / ANDHRAPRADESH / సహస్ర చండీయాగంలో పాల్గోన్న శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారు

సహస్ర చండీయాగంలో పాల్గోన్న శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారు

విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివార్లు అక్టోబర్ 17, గురువారం నాడు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం, నారాయణపురం గ్రామంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సహస్ర చండీయాగం కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. అర్చకుల వేదమంతోచ్ఛారణల మధ్య, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబసభ్యులు స్వామిజీలకు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. స్వామివార్ల ఆగమనం సందర్భంగా సహస్రచండీయాగానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. శ్రీ స్వరూపానందేంద్ర స్వామివారు భక్తులకు అభివాదం చేస్తూ యాగశాలకు తరలివెళ్లారు.. సహస్రచండీయాగంలో భాగంగా జరిగిన మహా పూర్ణాహుతి కార్యక్రమంలో ఇరువురు స్వామిజీలు పాల్గొన్నారు. సహస్రచండీయాగ పారాయణ, జపానుష్ఠాన, దశాంస హోమం, చతుర్వేదముల పూర్ణాహుతి కలశ విసర్జనగావించారు. ఈ సందర్భంగా శ్రీ స్వరూపానందేంద్ర, శ్రీ స్వాత్వానందేద్ర స్వామివార్లు యాగ యాజమ్యానం అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబసభ్యులకు, భక్తజనులకు శుభాశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గాయత్రి గ్రానైట్స్ అధినేత వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)తో పాటు ఇతర రాజకీయ ప్రముఖులు, భక్తులు, హిందూ ధర్మ ప్రచారయాత్ర సమన్వయకర్త, దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat