తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరగనున్న హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో భాగంగా మంత్రి సత్యవతి రాథోడ్ ఈ రోజు శుక్రవారం నేరేడుచర్ల మండలంలోని తండాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ తండాల్లో రోడ్డు లేవని, ఇండ్లు లేవని కనీసం ఒక్క నాయకుడు కూడా మా కోసం రాలేదని ఈ రోజు మంత్రి స్వయంగా మీరు వచ్చినందుకు తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఈ తండాలకు రోడ్లు వేయించే బాధ్యత తనదని, అర్హులందరికీ ఇండ్లు కూడా మంజూరు చేస్తానని, ఎస్టీ సబ్ప్లాన్ నిధుల నుంచి కేటాయింపులు చేసి తండాలను అభివృద్ధి చేస్తానని వాగ్ధానం చేశారు.
తండాలలో వందకు వందశాతం కారుగుర్తుకు ఓటు వేస్తామని తీర్మాణాలు చేస్తున్నాయని, అన్ని తండాలూ అదే స్పూర్తిని ప్రదర్శించి టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే ఇన్ని రోజులు కనీసం చూడడానికే రానివాళ్లు ఇక మీ సమస్యలు ఎక్కడ పట్టించుకుంటారని అన్నారు.