వరి ధాన్యం, పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలో బిఎస్ఎన్ గార్డెన్ లో పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో వరిధాన్యం, పత్తి కొనుగోళ్లపై జిల్లా స్థాయి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. రైతులు తేమ శాతం తక్కువగా ఉన్న ధాన్యాన్ని మార్కెట్ కు తీసుకు వచ్చేలా చూడాలన్నారు. తేమశాతం 8 శాతం ఉండేటట్లు చూసుకోండి. తేమ శాతంపై రైతు సమన్వయ కమిటి గ్రామాలలో రైతులకు అవగాహన కల్పించాలి. తేమ పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. రైతు సమన్వయ కర్తలు, అధికారులు సమన్వయంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, జడ్పి చైర్మెన్ పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, జెసి ఓజె మధు, జిసిసి చైర్మెన్ గాంధీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.