ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే డయాలసిస్ రోగులకు రూ పదివేల ను పెన్షన్ గా ఇస్తున్న సంగతి విదితమే.
తాజాగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి పెన్షన్ అందించాలని వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. రక్తశుద్ధి చేయించుకోకున్నా ,కిడ్నీ వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి నెలకు రూ.5000 వేల పెన్షన్ అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆదేశాలను జారీ చేశారు. దీంతో అర్హులను ఎలా గుర్తించాలి. వాటి విధివిధానాలు ఏంటీ తదితర అంశాలపై అధికారులు అధ్యాయనం చేస్తున్నారు.