తెలంగాణ ఆర్టీసీకి చెందిన సిబ్బంది గత పంతొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విధితమే. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అందులో భాగంగా కార్మికుల డిమాండ్ల పరిశీలనకు ఆర్టీసీ ఈడీలతో కూడిన ఆరుగురు అధికారులతో పాటుగా హైకోర్టు సూచించిన ఇరవై ఒక్క అంశాలను అధ్యయనం చేయడానికి కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
ఈ కమిటీ ఒకటి రెండ్రోజుల్లో అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నది. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తమ నివేదికను హైకోర్టుకు సమర్పించనున్నది.