రాజకీయం వేరు చాణక్యం వేరు ,పరిపాలన వేరు రాజకీయ ప్రత్యర్ధి పార్టీ ని దెబ్బ కొట్టడం వేరు.. ఇవన్నీ తెలిసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంటే అవుననే చెప్పుకోవాలి. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిత్యం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్న జగన్ పై అత్యంత దారుణంగా ఓడిపోయిన కూడా తెలుగుదేశం పార్టీ ఏవిధంగానూ జగన్ కు ఊపిరి సలపనివ్వలేదు. జగన్ చేపట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమం పైన బురద జల్లుతూ వచ్చింది. జగన్ పరిపాలన నిత్యం ఎగతాళి చేస్తూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు సోషల్ మీడియా సైనికులు. అయితే జగన్ చాలా మొండివాడు అనే సామెతను నిరూపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి వచ్చే అక్రమమైన మార్గాల ఆర్థిక మూలాలను జగన్ పెకిలిస్తున్నారు. ముఖ్యంగా విద్య పేరుతో వ్యాపారం చేసే వారిని అందరికంటే ముందుగా కట్టడి చేశారు వీరిలో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండటం గమనార్హం. అనంతరం రాయలసీమ వ్యాప్తంగా అక్రమంగా జరుగుతున్న క్వారీలను మూయించి వేశారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్కడ కట్టడాలు ఎక్కువ తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఉండడంతో వాటిని కూడా తీయించి వేస్తామన్నారు. తాజాగా జేసీ దివాకర్ రెడ్డిని చెందిన ట్రావెల్స్ బస్సులను లారీలను అక్రమంగా నడుస్తున్న వాటిని కూడా సీజ్ చేశారు. జగన్ పై అక్రమార్కులు అనే ఎవరైతే ముద్రవేశారు వాళ్ళ అక్రమాలను బయటపెడుతూ జగన్ నిజమైన హీరో అనిపించుకుంటున్నారు.