ఉద్యోగాలు, ఉపాథి కల్పించే చదువులు, శిక్షణపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యాసంస్థనుంచి బయటకు వస్తున్న ప్రతి విద్యార్థి ఉద్యోగం లేదా, ఉపాథి పొందడమే లక్ష్యంగా సరికొత్త పంథాలో వీటిని ముందుకు తీసకెళ్లాలని నిశ్చయించారు. ప్రభుత్వంలో వివిధ శాఖలు నిర్వహిస్తున్న నైపుణ్యాభివద్ది, ఉపాధి కల్పన కార్యక్రమాలను ఒక్కతాటిపైకి తీసుకువస్తూ దీనికి సంబంధించి విద్య, శిక్షణ, పరిపాలనా పరంగా పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివద్ధి, శిక్షణ, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడానికి, మెరుగుపరుచుకోవడానికి వీలుగా రాష్ట్రస్థాయిలో తొలిసారిగా ప్రత్యేక యూనివర్శిటీ ఏర్పాటుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ యూనివర్శిటీ కింద ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో నైపుణ్యాభివద్దికోసం ఒక కాలేజీని ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఐటీఐ, పాలిటెక్నిక్, బీకాం సహా డిగ్రీ కోర్సులు, ఇంజినీరింగ్ విద్యార్థులకు అదనంగా ఏడాదిపాటు అప్రెంటిస్ చేయించాలని సీఎం నిర్ణయించారు. ఆ తర్వాతే పరీక్షలు నిర్వహించాలన్నారు. ఉద్యోగం, ఉపాథి పొందడమే లక్ష్యంగా ఈకోర్సుల పాఠ్యప్రణాళికల్లో మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి అ«ధికారులకు స్పష్టంచేశారు. అలాగే ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజి రూపురేఖలను కూడా మార్చాలని నిశ్చయించారు. నైపుణ్యాభివద్ధికోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.. ప్రపంచం మనరాష్ట్రంవైపు చూసేలా ఉండాలని సీఎం తేల్చిచెప్పారు.