తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే దీపావళి బోనస్ ను ప్రకటించి.. ఒక్కో కార్మికుడికి రూ.64,700 లను అందజేసింది.
దీంతో పాటుగా మరో శుభవార్తను సింగరేణి కార్మికులకు అందించింది ప్రభుత్వం. అందులో భాగంగా సింగరేణి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఇటీవల భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా సింగరేణి ప్రాంతంలో భూక్రమబద్ధీకరణకు గడవు పెంచాలని విన్నవించారు.
దీనికి స్పందించిన ముఖ్యమంత్రి సింగరేణి ప్రాంతాల్లో లీజు గడవు పూర్తయిన తర్వాత సర్కారుకివ్వాల్సిన భూముల్లో కార్మికులు అక్రమంగా నిర్మాణాలు చేపట్టడంతో ఈ భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తు గడవును డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు దాకా పొడిగించారు. దీనికి సంబంధించి రెవిన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు.