దరువు ఛానల్ ఎండి కరణ్ రెడ్డిని గత కొద్దిరోజులక్రితం ఏపీ ప్రభుత్వం, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలంగాణ టీటీడీ ఎల్ఏసి వైస్ ప్రెసిడెంట్ గా నియమించారు. ఈ సందర్భంగా ఆదివారం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కరణ్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం పర్యటించి టీటీడీ కి సంబంధించిన అన్ని కార్యక్రమాలను దగ్గరుండి చూసుకోవాలని, తెలంగాణలో టీటీడీ దేవాలయాల అభివృద్ధి, ధూప దీప నైవేద్యాల కార్యక్రమాలను పర్యవేక్షించాలన్నారు. టీటీడీ ఆధ్యాత్మికతను మరింత పెంచేలా గొప్ప కార్యక్రమాలు చేపట్టాలని వైవి సుబ్బారెడ్డి కరణ్ రెడ్డికి తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని స్వామి వారికి సేవ చేసుకునే అదృష్టాన్ని వినియోగించుకుంటానని కరణ్ రెడ్డి తెలిపారు. తనను నమ్మి ఈ బాధ్యతలను అప్పగించినందుకు టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డికి, ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.