టాలీవుడ్ సీనియర్ నటి.. హీరోయిన్ గీతాంజలి హైదరాబాద్ లో అపోలో ఆసుపత్రిలోని చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో కన్నుమూశారు. గీతాంజలి అప్పటి ఏపీలో కాకినాడ నగరంలో జన్మించారు.సీతారామ కళ్యాణం అనే మూవీ ద్వారా తెలుగు మూవీల్లోకి ఎంట్రీచ్చారు.
గీతాంజలి అసలు పేరు మణి. పారస్ మణి అనే హిందీ చిత్రంలో గీతాంజలి నటిస్తుండగా ఆ మూవీ నిర్మాతలు ఆమె పేరును గీతాంజలిగా మార్చారు. ఆ పేరు సినీ రంగంలో అలానే స్థిరపడిపోయింది. పలు తెలుగు సినిమాల్లో నటించిన ఆమె కన్నడ,మలయాళం ,హిందీ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.