టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రెండు విభాగాలుగా విడుదలైన బాహుబలి మూవీ సిరీస్ ఇటు తెలుగులోనే కాకుండా యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ఎంతగా సంచలనం సృష్టిస్తూ నిర్మాతలకు కాసుల పంట కురిపించిందో మనకు తెల్సిందే.
ఈ చిత్రంతోనే ప్రభాస్ యూనివర్శల్ హీరోగా మారిపోయాడు. మరోవైపు తన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా ఆర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నయనతార ఇతరులు ప్రధాన పాత్రదారుల్లో మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటించి… లేటెస్ట్ గా విడుదలై ఇండస్ట్రీనే షేక్ చేసిన చిత్రం సైరా నరసింహా రెడ్డి.
ఈ చిత్రం యొక్క కలెక్షన్లు నైజాం ఏరియాలో బాహుబలి తర్వాత స్థానంలో నిలిచాయని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.నైజాం ఏరియాలో సైరా మొత్తం రూ.32.50కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. దీంతో చిరు తను మరోకసారి నైజాం దాదా అన్పించుకున్నారు అని సినీ వర్గాలు కోడై కూస్తున్నారు.