Home / SLIDER / జర్మనీలో మంత్రి నిరంజన్ రెడ్డి బృందం పర్యటన

జర్మనీలో మంత్రి నిరంజన్ రెడ్డి బృందం పర్యటన

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి,ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వరరెడ్డి,విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు తదితరులతో కలిసి జర్మనీలో పర్యటిస్తున్న సంగతి విదితమే.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి బెర్లిన్‌ సమీపంలో ఉన్న సమీకృత వ్యవసాయ క్షేత్రాన్నిసందర్శించారు. ఇలాంటి క్షేత్రాలకు అక్కడ మంచి ఆదరణ ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రయోగాత్మకంగా ఇలాంటివి ఏర్పాటు చేస్తే ఆదరణ లభించే అవకాశం ఉందన్నారు.

జర్మనీ తరహాలోనే ఒకే చోట అన్నిరకాల కూరగాయలు, ఇతర ఆహార పదార్ధాలు, పాలు వంటి వాటిని వ్యవసాయ క్షేత్రం వద్దనే విక్రయించే అవకాశం ఉంటుందన్నారు. రైతులతోపాటు చాలా మందికి ఉపాధి కల్పించవచ్చన్నారు. తెలంగాణలో ఇప్పటికే సేంద్రీయ వ్యవసాయానికి ప్రభుత్వం సహకారం అందిస్తోందని ఆయన అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat