ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. పదవ తరగతి లేదా ఐటీఐ చదివి ఉన్న వారికి ఇదోక గొప్ప అవకాశం.. మొత్తం నలబై ఒక్క ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో ఉన్న 4,085 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్నది.
ఐటీఐ విభాగంలో 3,120 పోస్టులు,నాన్ ఐటీఐ విభాగంలో 1,595 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ సిద్ధమైంది. నాన్ ఐటీఐ విభాగ పోస్టులకు పదవ తరగతి(యాబై శాతం మార్కులు,గణితం/సైన్స్ లో నలబై శాతం మార్కులు)పాసై ఉండాలి.
ఐటీఐ విభాగ పోస్టులకు ఐటీఐ సర్టిపికేట్ ఉండాలి. అయితే వచ్చే నెల డిసెంబర్ చివరి వారంలో దరఖాస్తులను స్వీకరించబడతాయి. అభ్యర్థుల వయస్సు 15-24 మధ్య ఉండాలి. మరిన్నీ వివరాలకు https://ofb.gov.in / వెబ్ సైట్ లో చూసి తెల్సుకోవచ్చు..