ప్రైవేట్ రంగంలోకి వారికి ఓ గుడ్ న్యూస్. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్వో) ఉద్యోగుల సౌకర్యార్థం శుక్రవారం రెండు కొత్త సదుపాయాలను ప్రకటించింది. ప్రైవేట్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు ఇకపై నేరుగా యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్)ను నమోదు చేసుకోవచ్చు. ప్రస్తతం ఉద్యోగులు తాము పని చేసే సంస్థల ద్వారా దీన్ని నమోదు చేసుకోవాల్సి ఉంది. ఉద్యోగాలు మారిన సందర్భాల్లో పీఎఫ్ బదిలీ దరఖాస్తు కోసం ఆయా సంస్థలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఈ ఇబ్బంది లేకుండా ఉండేందుకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ శుక్రవారం కొత్త సౌలభ్యాన్ని తీసుకొచ్చింది.
దీంతోపాటుగా, 65 లక్షల మంది పింఛన్దారుల కోసం మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. పింఛన్కు సంబంధించిన పత్రాలు, పింఛన్ పేమెంట్ ఆర్డర్ (పీపీవో)ను ఇకపై డిజీ లాకర్లో పొందవచ్చు. దీని కోసం నేషనల్ ఈ-గవర్నెస్ డివిజన్(ఎన్ఈజీడీ)ని డిజీ లాకర్తో ఈపీఎఫ్వో అనుసంధానం చేసింది.